ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లకు టాప్ హీరోలు వస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి కూడా బాగానే ప్రమోట్ చేసి మాట్లాడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో హీరోల మద్య ఎలాంటి ఇగో ఫీలింగ్స్ లేకుండా మంచి స్నేహభావంగా ఉంటున్నామని తెలపడానికి ఇలాంటి ఫంక్షన్లకు పెద్ద హీరోలను సైతం ఆహ్వానిస్తున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీల యంగ్ హీరో శర్వానంద్ మంచి విజయాలతో ముందుకు దూసుకు వెళ్తున్నాడు.
ఈ సంవత్సరం రిలీజ్ అయిన శతమానం భవతి చిత్రంతో అద్భుతమైన సక్సెస్ అందుకున్న శర్వానంద్ తాజాగా మారుతి దర్శకత్వంలో ‘మహానుభావుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక దర్శకుడిగా మొదట్లో కాస్త ఆటుపోట్లు అందుకున్న మారుతి ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘భలే భలే మగాడివోయ్’ సూపర్ డూపర్ విజయాలు అందుకున్నారు.
వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘మహానుభావుడు’ చిత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ఫ్రీరిలీజ్ ఫంక్షన్ కి 'బాహుబలి' హీరో ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'రన్ రాజా రన్' చిత్రం ఎవరో తీయాలని అనుకుంటున్నప్పుడు వంశీ.. శర్వా పేరు సూచించారు. ఇక ఆ సినిమాతో శర్వాకు మేమంతా ఫ్యాన్స్ అయిపోయామని అన్నాడు ప్రభాస్.
ఒకరకంగా చెప్పాలంటే..శర్వానంద్ మా ఇంటి హీరో అని ప్రభాస్ అన్నాడు. డైరెక్టర్ మారుతీ సినిమాలు బాగుంటాయి. ఆయన సినిమాలు హాస్యాన్ని బాగా పండిస్తాయని చెప్పాడు. నానికి మంచి హిట్ ఇచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాల మాదిరిగా ఇది కూడా మంచి విజయం సాధించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పాడు డార్లింగ్. ఈ సినిమాకు తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. మారుతీ దర్శకుడు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది.