జూనియర్ ఎన్టీఆర్ తన ‘జై ల కుశ’ రిజల్ట్ పై అసహనాన్ని వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ‘జై లవ కుశ’ పరాజయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ ఈసినిమా పై నెగిటివ్ కామెంట్స్ వ్రాసిన వారిని దారినపోయే దానయ్యలుగా కామెంట్ చేసాడు జూనియర్. 

అయితే తన సినిమా ఘనవిజయం సాధించిందని ఏమర్జనీ కేర్ లో ఉన్న సినిమాలకు కూడ వైద్యం చేసి ప్రాణం పోయగల వైద్యులు ప్రేక్షకులు మాత్రమే అంటూ తన ‘జై లవ కుశ’ పరాజయం పై పరోక్ష అంగీకారంతో ఆసక్తికర కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఈమూవీ పై నెగిటివ్ కామెంట్స్ ప్రచారం చేస్తున్న దారినపోయే దానయ్యలకు అసలు సినిమాలు చూడటం అదేవిధంగా విశ్లేషించడం రాదు అంటూ మరొక ఆసక్తికర ట్విస్ట్ ఇచ్చాడు జూనియర్.

దీనినిబట్టి చూస్తుంటే జూనియర్ ప్రస్తుతం ‘జై లవ కుశ’ రిజల్ట్ పట్ల ఎంత అసహనంతో ఉన్నాడో అర్ధం అవుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం ‘దువ్వాడ జగన్నాథం’ పరాజయం తరువాత అల్లు అర్జున్ కూడ ఇదే విధంగా నెగిటివ్ కామెంట్స్ వ్రాసిన మీడియా వర్గాలను టార్గెట్ చేస్తూ కామెంట్ చేసాడు. 

దీనితో జూనియర్ బన్నీ అడుగుజాడలలో పయనిస్తున్నాడా అన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే జూనియర్ గతంలో నటించిన ‘జనతా గ్యారేజ్’ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలను మెచ్చుకుంటూ కామెంట్స్ చేసిన ఇదే దారినపోయే దానయ్యల సంగతి జూనియర్ మర్చిపోయాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఏమైనా జూనియర్ అసహనం ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: