రేణు దేశాయ్ పవన్ తో విడిపోయిన తరువాత పూణెలో సెటిలైన సంగతి తెలిసిందే. మరాఠీ సినిమా పరిశ్రమలో నిర్మాతగా, దర్శకురాలిగా సినిమాలు చేసిన ఆమె త్వరలో తిరిగి యూటర్న్ తీసుకుని బుల్లితెర డాన్స్ రియాల్టీ షో ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

సెప్టెంబర్ 30వ తేదీ నుండి మాటీవీలో ప్రసారం కానున్న 'నీతోనే డాన్స్' అనే డాన్స్ రియాల్టీ షోకు ఆమె జడ్జిగా వ్యవహరించబోతోంది. డాన్స్ విత్ రొమాన్స్ కాన్సెప్ట్ తో హిందీలో ప్రసారం అవుతున్న 'నాచ్ బలియే' తరహాలో ఈ షో ఉంటుందని తెలుస్తోంది. 

అయితే ఈ షో ప్రారంభానికి ముందే దుష్ప్రచారం మొదలు కావడం షాకింగ్ న్యూస్ గా మారింది.   వాస్తవానికి ఈ షో ఎలా ఉంటుందో? ఎలాంటి కాన్సెప్టుతో సాగుతుందో అనే విషయాలు తెలియకుండా  కొందరు సోషల్ మీడియాలో ఈ షో ను టార్గెట్ చేస్తూ ఇది ‘ప్లాప్ షో' అంటూ నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టడం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారడమే కాకుండా ఈ నెగెటివ్ ప్రచారం చేస్తున్నది ఎవరు అనే విషయం పై చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే అనేకసార్లు పవన్ వీరాభిమానులచేత టార్గెట్ కాబడ్డ రేణు దేశాయ్ మళ్ళీ ఈసారి కూడ పవన్ అభిమానుల ఆగ్రహానికి గురి అయిందా అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. మహిళాసాధికారికతకు నిదర్శనంగా వ్యతిరేక పరిస్థుతులలో కూడ రేణు దేశాయ్ తన ప్రతిభను చాటుకుంటూ తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తోంది. 

అయితే ఆమెను టార్గెట్ చేస్తూ ఇప్పుడు వస్తున్న కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈమధ్య కాలంలో బుల్లితెరకు దూరమైన ఉదయ్ భాను యాంకర్ గా రేణు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ షో ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ ముగియడంతో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కాబోతోంది. మరి ఈ నెగిటివ్ ప్రచారానికి రేణు తన సమర్ధతతో ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: