సౌత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న మహేష్బాబు - మురుగదాస్ మూవీ స్పైడర్ థియేటర్లలోకి దిగేందుకు మరి కొద్ది గంటల టైం మాత్రమే మిగిలి ఉంది. అయితే అప్పుడే స్పైడర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇండియన్ సినిమాల విడుదలకు ముందే వాటి రివ్యూ, రేటింగ్స్ చెప్పేసే దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు, మూవీ మార్కెటింగ్ నిపుణుడు ఉమైర్ సంధు స్పైడర్ సినిమా ఫస్ట్ రివ్యూతో పాటు రేటింగ్ కూడా ఇచ్చేశాడు.
ఇక స్పైడర్ సినిమా అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ అని ఆకాశానికి ఎత్తేశాడు. ముందునుంచి అందరూ అనుకుంటున్నట్టుగానే స్పైడర్ హీరో , విలన్ మధ్య అదిరిపోయే మైండ్గేమ్తో నడుస్తుందట. తాను ఎవ్వరో తెలియకుండా సమాజానికి హానికలిగిస్తూ పెద్ద ప్రమాదికారిగా మారిన విలన్ ఆటను హీరో కట్టించాడు అన్నదే స్పైడర్ స్టోరీ అని ఉమైర్ చెప్పాడు.
ఇక ఈ విలన్ను కనిపెట్టేందుకు హీరో వేసే ఎత్తులు, పై ఎత్తులు సూపర్బ్గా ఉంటాయని చెప్పిన ఉమైర్ సినిమా మొత్తానికి క్లైమాక్స్ అదిరిపోతుందని చెప్పాడు. ఈ క్లైమాక్స్కు ప్రతి ఒక్కరు మెస్మరైజ్ అయిపోతారట. అటు క్లాస్ ను, ఇటు మాస్ ను అలరించే విధంగా తయారైన 'స్పైడర్', ఈ దసరాకు బ్లాక్ బస్టరేనని తేల్చారు.
మహేష్ ఎప్పటిలాగానే తనదైన స్టైల్లో సూపర్బ్ యాక్టింగ్ చేశాడని, ఇక విలన్గా చేసిన ఎస్.జె.సూర్య యాక్టింగ్ కూడా పీక్ స్టేజ్లో ఉంటుందని ఉమైర్ చెప్పాడు.
హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ కూడా తన పాత్రకు న్యాయం చేసిందనీ, హీరో స్నేహితుడి పాత్రలో ప్రియదర్శి, ఇతర తారాగణం బాగానే నటించారంటున్నారు.
ఇక దసరాకు మహేష్ అభిమానులు పండగ షురూ చేసుకోవచ్చని చెప్పిన ఉమైర్ స్పైడర్కు 3.5 / 5 రేటింగ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ జై లవకుశ సినిమాకు సైతం ఇదే రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.