ప్రస్తుతం సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అంతా ఒకే ఒక్క సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఎవరిని కదిలించినా ఒక్కటే మాట స్పైడర్...స్పైడర్. టాలీవుడ్లో స్టార్ హీరో మహేష్బాబు, కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్ కావడంతో ఈ రెండు భాషలు, అటు కర్ణాటకతో పాటు మళయాళంలో రిలీజ్ చేస్తుండడంతో అక్కడ కూడా భారీ హైప్ వచ్చేసింది.
ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు, అటు తమిళనాడుతో పాటు కర్ణాటకలో తెలుగు, తమిళ భాషల్లో స్పైడర్ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇక మళయాళంలోను అంతే.. సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు మరి కొద్ది గంటల టైం మాత్రమే ఉంది. మహేష్ అభిమానులే కాదు...సాధారణ సినీ అభిమానులు కూడా స్పైడర్ బెనిఫిట్ షో ఎప్పుడు చూసేద్దామా ? అని ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు.
అయితే స్పైడర్ ఫ్యాన్స్కు బెనిఫిట్ షోల విషయంలో కాస్త నిరాశ తప్పేలా లేదు. తెలంగాణలో కీలకమైన హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ అంతటా బెనిఫిట్ షోలకు పోలీసుల అనుమతి లేకపోవడంతో ఇక్కడ ముందుగా షోలు పడట్లేదు. ఎన్టీఆర్ జై లవకుశ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు లేని సంగతి తెలిసిందే. ఇప్పుడు స్పైడర్కీ అదే పరిస్థితి ఎదురైంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మహేష్ అభిమానులకు నిరాశ తప్పడం లేదు.
స్పైడర్కు సంబంధించి తెలంగాణలో ఉదయం 6 గంటలకు కూడా షోలు పడట్లేదట. ఉదయం ఆరు గంటల ఆటకు కూడా నో చెప్పారని తెలుస్తోంది. దాంతో.. 8.45 షోతోనే స్పైడర్ హంగామా మొదలుకాబోతోంది. ఇక ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం స్పైడర్ హంగామా తెల్లవారు ఝామున 4 గంటలకే ప్రారంభం కానుంది. ఇక్కడ అన్ని సినిమాలు ముందుగానే షోలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే స్పైడర్ హంగామా రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుగా ఉభయగోదావరి జిల్లాల్లోనే ప్రారభంకానుంది.