తెలుగు ఇండస్ట్రీలో ఎంతో కమెడియన్స్ ఉన్నారు..వారిలో కొంత మంది హీరోలుగా మారారు. పాత తరం సినిమాల్లో పద్మనాభం,రాజబాబు,చలం లాంటి వారు కమెడియన్లు గా రాణిస్తూనే..హీరోలుగా కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత బ్రహ్మానందం, ఆలి లాంటి వారు కూడా కమెడియన్లు గా చేస్తూనే..హీరోలుగా కొన్ని సినిమాల్లో నటించారు. తెలుగు ఇండస్ట్రీలోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ తనదైన మ్యానరీజం, డైలాగ్స్ తో తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నాడు.
సునీల్ ప్రముఖ దర్శకులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి మంచి స్నేహితుడు. అతని సలహా మేరకు ‘అందాల రాముడు’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘మర్యాదరామన్న’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి పలు కామెడీ చిత్రాల్లో హీరోగా నటించిన సునీల్ కి ఈ మద్య కాలం కలిసి రావడం లేదు.
రీసెంట్ గా రిలీజ్ అయిన ఉంగరాల రాంబాబు కూడా నిరాశ పరిచింది. కమెడియన్ గా స్టార్ క్రేజ్ దక్కించుకున్న నటుడు. తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నాక ఫస్ట్ లో కొంచెం పర్వాలేదనిపించుకున్నాడు..ఈ మద్య కాస్త నిరాశలో ఉన్నాడు. త్వరలో సునీల్ గోపి కృష్ణ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం.
తాజాగా సునీల్ తన గొప్ప మనసును చాటుకున్నాడు..ఇరవై మంది అనాథ పిల్లలను రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్లారు. ఎప్పటి నుంచి రామోజీ ఫిలిమ్ సిటీ చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ ఆనాథలకు దగ్గరుండి వారికి కావాల్సినవి ఇప్పించి రామోజీ ఫిల్మ్ సిటీ చూపించాడు. తమకు బాగా ఇష్టమైన నటుడితో ఎంజాయ్ చేయడం జీవితంలో మర్చిపోలేమని ఈ సందర్భంగా పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన మనసున్న పిల్లలతో ఇలా గడపడం నిజంగా తన అదృష్టమని సునిల్ చెప్పుకొచ్చాడు.