బుల్లితెర యాంకర్గా క్రేజ్ తెచ్చుకున్న ఓంకార్ డైరెక్ట్ చేసిన రాజు గారి గది సినిమా సూపర్ హిట్ అయ్యింది. రెండేళ్ల క్రితం దీపావళికి వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్గా రాజు గారి గది 2 తెరకెక్కింది. కొద్ది రోజుల క్రితం మామాకోడళ్లు నాగార్జు, సమంతలో ఈ సినిమాలో ప్రధానపాత్రలో నటించడంతో పాటు ట్రైలర్లు, టీజర్లు సినిమాపై ఆసక్తి పెంచాయి. రిలీజ్కు ముందు భారీ లాభాలు తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్, దుబాయ్లో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ఈ షోల టాక్ ప్రకారం సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో ? చూద్దాం. సముద్రం బీచ్లో ఓ రిసార్ట్లో ఉన్న స్నేహితులకు దెయ్యం ఉందన్న సందేహం వస్తుంది. ఈ సందేహాలకు తోడుగా కొన్ని ఛాయలు కూడా కనపడతాయి. ఫస్టాఫ్ మొత్తం దెయ్యం ఎవరు ? సమంత వెనక ఎవరు ఉన్నారు ? అన్న దానిపై దర్శకుడు బాగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ కథనం నడిపించాడు.
సమంత సూపర్బ్ పెర్పామెన్స్కు తోడుగా నాగార్జున ఈ ఇష్యూను హ్యాండిల్ చేసే మెంటలిస్ట్ నిపుణుడి పాత్రలో చక్కగా నటించాడు. ఈ ఇద్దరి పాత్రలు సినిమాకు బాగా హైలెట్ అయ్యాయి. ఇక సెకండాఫ్లో ట్విస్ట్ రివీల్ అయ్యింది. ట్విస్ట్ రివీల్ అయ్యాక సినిమాపై అప్పటి వరకు కొనసాగిన ఆసక్తి కాస్త తగ్గుతుంది. సినిమా క్లైమాక్స్ను పూర్తిగా రివేంజ్ డ్రామాగా దర్శకుడు మార్చేశాడు.
హర్రర్ + కామెడీ జానర్లో దర్శకుడు కథనం నడిపించినా మరీ భయపెట్టేంత హర్రర్ లేదు..అలాగని ఇరగబడి నవ్వే కామెడీనూ లేదు. ఓవరాల్గా నాగ్, సమంత పెర్పామెన్స్లు సినిమాను నిలబెట్టాయి. ఫస్ట్ షో టాక్ ప్రకారం సినిమాకు పర్లేదనే అంటున్నారు. ఇక పూర్తి రివ్యూ వచ్చాక కాని ఈ సినిమా జాతకం ఎలా ఉంటుందన్నది తేలిపోనుంది.