ఓంకార్ దర్వకత్వంలో వచ్చిన రాజు గారి గది సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాకు సీక్వెల్గా అదే టైటిల్తో రాజు గారి గది 2 పేరుతో తెరకెక్కిన సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. రాజు గారి గది సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సక్వెల్పై భారీ అంచనాలు ఉన్నాయి. ముందు సినిమాలో ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండానే ఓంకార్ మంచి సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు ఈ సినిమాకు నాగార్జున, సమంత లాంటి స్టార్లు తోడయ్యాడు.
పీవీపీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలతో పాటు ఓంకార్ కూడా సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవడం, రీసెంట్గా మామకోడళ్లుగా మారిన నాగార్జున, సమంత తోడవ్వడంతో పాటు టీజర్లు, ట్రైలర్లు, ప్రి రిలీజ్ బిజినెస్ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల సినిమా దాదాపు హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది.
తొలి రోజు ఓవర్సీస్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోను రాజు గారి గది 2 మంచి ప్రారంభం దక్కించుకుంది. యూఎస్లో రాజు గారి గది 2 సినిమా 80,000 డాలర్ల ఓపెనింగ్స్ రాబట్టుకుంది. దసరా సినిమాల హడావిడి పూర్తిగా తగ్గిపోవడంతో థియేటర్ల పరంగా కూడా ఇబ్బంది లేదు. వచ్చే వారం వరకు పెద్ద సినిమాలు లేకపోవడం కూడా రాజు గారి గది 2కు బాగా లక్ చిక్కినట్లయ్యింది.