కింగ్ నాగార్జున మనసులో ఏది ఉంటుందో అదే మాట్లాడేస్తాడు. ప్రస్తుతం ఆయన నటించిన రాజు గారి గది-2 సక్సెస్ అవడంతో ఆ సక్సెస్ మీట్ లో మరింత జోష్ గా కనిపించాడు నాగార్జున. సమంత కోడలుగా మారిన తర్వాత వచ్చిన మొదటి సినిమా ఇది హిట్ అయితేనే బాగుంటుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన నాగార్జున ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు.


ఇక పనిలో పనిగా సండే మెనూ కూడా బయటపెట్టాడు. ఓ బిరియాని తిన్నా.. దానికి ముందే ఓ రెండు బీర్లు తాగా.. హాయిగా పడుకున్నా అంటూ నాగార్జున చెప్పిన విధానం చూస్తే ఎవరికైనా షాక్ అనిపిస్తుంది. బీర్లు బిరియాని అని నాగార్జున మాట్లాడిన తీరు చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. 


ఇక రాజు గారి గది-2 సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ కావాలనే కట్ చేశామని దాని వల్ల సినిమాలో సీరియస్ నెస్ పోతుందని అన్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. సినిమాలో తాను కామెడీ పంచ్ లు వేయడం జరిగిందని అన్నారు. సినిమా సక్సెస్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు.


ఇక  మీసాలు గడ్డం ఎందుకు తీశారు అన్న ప్రశ్నలే పదే పదే వస్తుండగా కాస్త అసహనం ప్రదర్శించినట్టు కనిపించారు. సినిమా సక్సెస్ తో అక్కినేని కోడలు సమంత మరింత హ్యాపీగా కనిపించింది. ఓంకార్ రాజు గారి గది-3కి కథ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: