సినిమాలు తీస్తే నిర్మత అవుతారు లేదంటే డైరెక్టర్ అవుతారు కానీ ఒక సినిమా ఉంది ఆ సినిమా తీస్తే ఏకంగా ఎమ్మెల్యే అవుతారట. ఇంతకీ సినిమా తీసి నాయకుడు అవ్వబోతోంది ఎవరు అంటే రాకేశ్ రెడ్డి. ఆ ఈ మధ్య కాలం లో వినిపిస్త్తున్న ఈ రాకేశ్ రెడ్డి పేరు ఎవరిదో కాదు, వైకాపా సిట్టింగ్ నాయకుడు .. ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ అయిన రాకేశ్ రెడ్డి.
ఈ సినిమా ని తీయాలని రామ్ గోపాల్ వర్మ డిసైడ్ అయిన వెంటనే ఆయన్ని అప్ప్రోచ్ అయ్యి నేను తీస్తా అంటూ డబ్బు పెట్టారు రాకేశ్ రెడ్డి. ఈయన గతంలో సినిమాలు తీసిన అనుభవం లేదు. బెంగళూరులో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. పలమనేరు నియోజక వర్గానికి చెందినవారు. ఇదే నియోజక వర్గం నుంచి వైకాపా టిక్కెట్ పై అమర్ నాథ్ రెడ్డి గెలిచారు.
కానీ, తరువాత ఆయన జగన్ తో విభేదించి టీడీపీలో చేరిపోయి, మంత్రి అయ్యారు. ఆయన వెళ్లాక వైకాపాకి పలమనేరులో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఈ ప్రాంతం లోని నాయకులకీ వైకాపా వారికీ ఇప్పుడు ఈయనే ముఖ్యమైన దిక్కు గా మారాడు.
సో ఈయన ఇప్పుడు టీడీపీ కి కాస్త యాంటీ గా రాబోయే సినిమాలో డబ్బులు బాగా పెట్టి థియేటర్లకి ఎక్కించ గలిగితే ఈయనకి టికెట్ గ్యారెంటీ అంటున్నారు చాలామంది. అయితే నియోజికవర్గం మీద దృష్టి పెట్టకుండా సినిమా మీద , టీడీపీ యాంటీ చిత్రం మీదా దృష్టి పెడితే జగన్ టికెట్ ఇస్తారా లేదా అనేది ఆలోచించాలి.