తెలుగులో రంగం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న తమిళ హీరో జీవా తాజాగా ‘కీ’ చిత్రంతో వస్తున్నాడు. రోజురోజుకీ పెరుగుతున్న టెక్నాలజీతో వ్యక్తిగత జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న స్టోరీతో తెరకెక్కిన మూవీ ‘కీ’. దీపావళి సందర్భంగా ఈ టీజర్ను చిత్ర బృందం విడుదల చేసింది. `రంగం` ఫేం జీవా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కలీస్ దర్శకత్వంలో జీవా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కీ’. కంట్రోల్+ఆల్ట్+డై అనేది ఉప శీర్షిక. నిక్కీ గల్రాని హీరోయిన్ గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కింది.ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన బ్లూవేల్ ఆట ఈ నేపథ్యంతోనే ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే టెక్నాలజీ వల్ల వచ్చే అనర్థాలను చూపించనున్నట్లు తెలుస్తోంది.
విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. కృష్ణ క్రియేషన్స్ బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై మైకేల్ రాయప్పన్ నిర్మిస్తున్నారు.ట్రెండ్కు తగ్గట్టుగా టీజర్ వుండడంతో మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నిక్కీ గల్రాని హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి కలీస్ డైరెక్టర్. రాజేంద్రప్రసాద్, సుహాసిని కీలకపాత్ర పోషిస్తున్నారు.