జై లవ కుశ సక్సెస్ జోష్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన తర్వాత సినిమా త్రివిక్రం తో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇదే కాకుండా మరో ఇద్దరు దర్శకులు తారక్ తో సినిమా చేసేందుకు పోటీపడుతున్నారట. త్రివిక్రం సినిమా మార్చి దాకా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపించట్లేదు. ఈలోగా దిల్ రాజు సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడు.


ఇక విక్రం కుమార్ కూడా తారక్ కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశాడట. తారక్ అపాయింట్మెంట్ తీసుకుని కథ చెప్పే ఆలోచనలో ఉన్నాడు. విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా అంటే అది కచ్చితంగా అంచనాలను మించి ఉంటుంది. 24 తర్వాత అఖిల్ తో హలో సినిమా చేస్తున్నాడు విక్రం కుమార్.


ఇక ఈ ముగ్గురు తర్వాత పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాల దర్శకుడు అనీల్ రావిపుడి కూడా తారక్ తో సినిమా కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడట. మొత్తానికి తారక్ కోసం ముగ్గురు దర్శకుల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. జై లవ కుశలో జై పాత్రతో దర్శక రచయితలకు కొత్త కథలు కొత్త క్యారక్టర్లు సృష్టించే అవకాశం కల్పించిన తారక్ కచ్చితంగా మరిన్ని మంచి సినిమాలు చేస్తాడని ఆశించవచ్చు.


త్రివిక్రం సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. కథ కథనాలు రెగ్యులర్ ఎన్.టి.ఆర్ ఇమేజ్ కు కాస్త భిన్నంగా ఉంటాయని అంటున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: