డైరెక్టర్ కిషోర్ తిరుమల అట్టర్ ప్లాప్స్ మధ్యన ఉన్న హీరో రామ్ కి మంచి ఫ్యూచర్ ఇచ్చాడు . నేను శైలజ సినిమానే తన ఆఖరి ప్రయత్నంగా విడుదల చేసిన రాం బ్రహ్మాండమైన హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు.

దీంతో తదుపరి సినిమా కూడా కిషోర్ కే ఛాన్స్ ఇచ్చాడు. ఉన్నది ఒకటే జిందగీ అంటూ కాస్త లేటుగా షూట్ పూర్తి చేసుకుని విడుదల కి సిద్దం అవుతున్న ఈ సినిమా  ఈ నెల 27 న థియేటర్ లలోకి రాబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్ లో బిజీ గా ఉన్నారు ఈ చిత్ర బృందం మొత్తం . ఒక వీడియో ఇంటర్వ్యూ లో తన సినిమా విశేషాలు వరసపెట్టి చెప్పిన డైరెక్టర్ కిషోర్ ఈ సినిమా తరవాత చెయ్యాల్సిన సినిమాల ప్రస్తావన లో 'ఆడాళ్లూ మీకు జోహార్లు' ప్రస్తావన వచ్చింది.

ఈ సినిమాను ఆయన కొంతకాలం క్రితమే వెంకటేశ్ తో చేయవలసి వుంది. ఆ ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణమేమిటనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.అందుకు కిషోర్ తిరుమల స్పందిస్తూ .. ఈ ప్రాజెక్టు ఆగిపోలేదని చెప్పారు. స్క్రిప్ట్ కి సంబంధించిన పనులు పూర్తికాకపోవడం వలన, ఇతర ప్రాజెక్టులతో అటు వెంకీ .. ఇటు తాను బిజీగా ఉండటం వలన ఆలస్యమైందని అన్నారు.

వెంకటేశ్ తో తనకి విభేదాలు వచ్చాయనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదనీ, ఆయనతో తప్పకుండా ఆ సినిమా ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు. హీరో నాని తో కూడా ఒక సినిమాకి ప్లాన్ చేస్తున్నాము అనీ అది  కూడా స్క్రిప్ట్  దాదాపు ఆఖరి స్టేజీ లో ఉంది అనీ చెప్పారు ఆయన. 


మరింత సమాచారం తెలుసుకోండి: