సౌత్ లో క్రేజీ బ్యూటీ త్రిషా క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే.. దశాబ్ధ కాలం పైగా తెలుగు, తమిళ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా అభిమానులను సంపాదించిన త్రిషా ఈమధ్య కాస్త వెనుకపడ్డ సంగతి తెలిసిందే. కెరియర్ దాదాపు ముగించేసింది అనుకున్న టైంలో అమ్మడు మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టేసింది.


ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీ చేస్తున్న త్రిషా ఫీమేల్ లీడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుంది. మోహిని సినిమాతో రాబోతున్న త్రిషా తాను నిర్మాతగా మారుతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించింది. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుని పొరపాటున కూడా సినిమాలకు పెట్టనని తెగేసి చెప్పేసింది అమ్మడు.


తనకు నిర్మాతగా ఉండేంత ధైర్యం లేదని అంటుంది త్రిషా. ఇందులో సంపాదిస్తా కాని దీనికి మాత్రం ఖర్చు పెట్టనని ఖరాకండిగా చెప్పేస్తుంది త్రిషా. నిర్మాతగా చేయాలంటే త్రిష చెప్పినట్టుగా డబ్బు ఒకటే సరిపోదు దానికి కావాల్సిన ఐడియాలజీ ఉండాలి. బాలీవుడ్ లో అనుష్క శర్మ ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క సినిమాలను నిర్మిస్తుంది.


సౌత్ లో మాత్రం అంత తెగింపు ఉన్న హీరోయిన్స్ లేరని చెప్పాలి. సినిమాకు కోటి దాకా రెమ్యునరేషన్ తీసుకున్నా నిర్మాతగా మాత్రం చాలా కష్టం అనేస్తున్నారు. ఈమధ్య నయనతార కూడా ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుందని వార్తలు వచ్చాయి. నయన్ సంగతి ఏమో కాని నిర్మాతగా త్రిషా మాత్రం నా వల్ల కాదు బాబోయ్ అనేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: