విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలకు ఊతమిస్తూ టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇప్పటికే మహేష్, పవన్ లతో నటించిన వెంకీ ఈసారి యువ హీరోలతో సినిమా చేయబోతున్నాడట. తేజ డైరక్షన్ లో వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమాలో యువ హీరోకి ఛాన్స్ ఉందట. ఆ పాత్రలో నారా రోహిత్ లేదా సుమంత్ కాని నటించే అవకాశం ఉందట.


గురు తర్వాత వెంకటేష్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసిన తేజ ఓ పక్క ఎన్.టి.ఆర్ బయోపిక్ తో పాటు వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ ప్రొఫెసర్ గా కనిపిస్తాడని టాక్. ఇక సినిమాలో ఓ యువ హీరో కూడా నటిస్తాడని తెలుస్తుంది.


అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన సుమంత్ ఈ సినిమాలో నటించే అవకాశాలున్నాయట. ఇక అతని కాకుంటే రోహిత్ అయినా నటిస్తాడని అంటున్నారు. మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా అనీల్ సుంకర, సురేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు. 


ఇక ఇదే కాకుండా కిశోర్ తిరుమలతో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాను కూడా మళ్లీ లైన్ లోకి తెచ్చాడట వెంకటేష్. నేను శైలజ కిశోర్ తిరుమల అదే రాం తో ఉన్నది ఒకటే జిందగి సినిమా చేశాడు. రాం సినిమా మళ్లీ హిట్ కొడితే మాత్రం వెంకటేష్ తో సినిమా కన్ ఫాం అయినట్టే. 



మరింత సమాచారం తెలుసుకోండి: