భారతీయుడు సీక్వల్ గా ఇండియన్-2 సినిమాను ఎనౌన్స్ చేసి అంచనాలను పెంచేశారు. శంకర్, కమల్ హాసన్ కలిసి చేసే ఈ సినిమాకు తెలుగు నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడం అందరిని ఆశ్చర్యపరచింది. అసలు దిల్ రాజు ఎలా ఈ డీల్ సెట్ చేశాడు అన్నది ఎవరికి అంతుచిక్కలేదు. అయితే భారతీయుడు సినిమా ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం ఈ సినిమాలో భాగమవ్వాలని చూస్తున్నాడు.


కాని దిల్ రాజు మాత్రం చేస్తే తాను ఒక్కడినే ఈ ప్రాజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇక మరో పక్క లైకా ప్రొడక్షన్స్ కూడా ఇండియన్-2 మీద కన్నేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే శంకర్ తీస్తున్న రోబో సీక్వల్ మూవీ 2.0 సినిమాను 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న లైకా కుదిరితే ఇండియన్-2 నిర్మించేందుకు సిద్ధం అంటున్నారట.


దిల్ రాజు చేతుల్లోంచి దాదాపు ఈ ప్రాజెక్ట్ బయటకు వెళ్లిందని లేటెస్ట్ కోలీవుడ్ టాక్. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. ఏ.ఎం.రత్నం మాత్రం నిర్మాత ఎవరైనా సరే ఆ సినిమా సీక్వల్ కు రాయల్టీ అడుగుతున్నాడట. మరి సూర్య మూవీస్ ను కూడా అందులో భాగం చేస్తారా లేదా అన్నది చూడాలి.


దిల్ రాజు మాత్రం ఈ విషయంపై ఇంతకుముందు క్లారిటీ ఇచ్చినా మళ్లీ కోలీవుడ్ లో మాత్రం లైకా ప్రొడక్షన్స్ ఇండియన్-2 నిర్మిస్తున్నారని హడావిడి చేస్తుంది. బడ్జెట్ 200 కోట్లు అనేసరికి దిల్ రాజు జారుకున్నాడని అంటున్నారు. మరి వీటిలో నిజం ఏంటన్నది తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: