తెలుగు ఇండస్ట్రీకి రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు జాతీయ స్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’, ‘బాహుబలి2’ చిత్రాలతో ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో బాహుబలి సీరీస్ కోసం ఏకంగా ఐదు సంవత్సరాలు తన టైమ్ ని పూర్తిగా డెడికేట్ చేశాడు. అందుకే ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్.
హీరో అయినా, హీరోయిన్ అయినా ఒక సినిమా సూపర్హిట్ అయింతరువాత రెమ్యునరేషన్ భారీగా పెంచుతారు. అడిగినంత ఇస్తేనే నటిస్తామని తెగేసి చెబుతారు. 'బాహుబలి' రెండు భాగాల సినిమాతో అంతర్జాతీయ నటుడిగా ఎదిగిన ప్రభాస్ ఆయన అడగకుండానే ఆఫర్ చేసిన భారీ మొత్తాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించాడు.
బాహుబలి తరువాత ఈ యువ హీరోతో సినిమాలు తీయడానికి బడా నిర్మాతలు, ఎన్ఆర్ఐలు కాచుకొని కూర్చుకున్నారు. కొందరు ఊహించనంత పారితోషకం ఇస్తామంటూ ముందుకొస్తున్నారు. ఈమధ్య ప్రభాస్తో తెలుగు, హిందీల్లో ద్విభాషా చిత్రం తీస్తానని ఓ నిర్మాత వచ్చాడు. ఊహించనంత ఇస్తానని చెప్పాడు. ఇలా చెప్పినప్పుడు ఏ హీరో అయినా ఏం చేస్తాడు? సంతోషంగా ఓకే చెబుతాడు. కాని ప్రభాస్ 'నో' చెప్పాడు. ఇది బాహుబలి ఘనవిజయంతో వచ్చిన అహంభావమో, పొగరో కాదు.
ఆ నిర్మాత ముందుగా కథ సిద్ధం చేసుకోకుండా భారీ మొత్తం ఇచ్చి కమిట్ చేయించాలనుకున్నాడు. దీంతో ప్రభాస్ తనకు డబ్బు ముఖ్యం కాదని, కథ ప్రధానమని, అదేమిటో చెప్పకుండా ఎంత ఆఫర్ చేసినా తాను ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేశాడు. సరైన కథ లేకపోతే అది ఫెయిలైపోయి బాహుబలితో వచ్చిన ఇమేజ్ కాస్తా పోతుంది. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ హీరో పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ విషయం చెప్పారు.