సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చారు..రెండో తరం..మూడో తరం వారసులుగా కూడా ఎంట్రీ ఇస్తున్నారు.  తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్, కళ్యాన్ రామ్, తారకరత్న లు ఎంట్రీ ఇచ్చారు.  ప్రస్తుతం బాలయ్య, ఎన్టీఆర్ లు సూపర్ హిట్ చిత్రాలతో మంచి ఊపు లో ఉన్నారు. 

ఇక టెంపర్ చిత్రం నుంచి మొన్నటి జై లవ కుశ వరకు అద్భుతమైన విజయాలు సాధిస్తూ..మంచి జోష్ లో ఉన్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నారు. నిన్న హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలు, క్లాప్, ముహూర్తం షాట్ షరా మామూలుగానే జరిగిపోయాయి.

చీఫ్ గెస్ట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ వచ్చారు.  ఈ సందర్భంగా ఎన్టీఆర్ ని ముహుర్తం షాట్ క్లాప్ కొట్టి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎన్టీఆర్ ని కౌగిలించుకొని బెస్ట్ విషెస్ తెలిపారు. 

ఈ సందర్భంగా ఎన్టీఆర్, పవన్ కంటే అభయ్ హంగామాయే ఎక్కువగా కనిపించింది. ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్.. వయసు మూడేళ్లు. ఈ బుడ్డోడు చేసిన సందడి అంతాఇంతా కాదు.  అంతే కాదు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రంలో  అభయ్ రామ్ కోసం ఒక గెస్ట్ రోల్ ప్లాన్ చేస్తున్నారన్న మాటలు కూడా వినిపించాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: