తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానులు ఎంతగా అభిమానిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  దాదాపు పది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ సంవత్సరం ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చారు.  ఈ సినిమాలో చిరంజీవి స్టామినా చూసి అందరూ ఆశ్చర్యపోయారు..పది సంవత్సరాల క్రితం శంకర్ దాదా జిందాబాద్ లో ఎలా ఉన్నారో..ఇప్పుడూ అలాగే ఉన్నారు.  బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరంజీవికి బ్రహ్మరథం పట్టారు అభిమాను.

ప్రస్తుతం ఆయన 151  చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి రెడీ అవుతున్నారు.  తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగింది. ఆయన ఇంట్లోంచి రూ.2 ల‌క్ష‌లు మాయ‌మ‌య్యాయ‌ని చిరంజీవి మేనేజ‌ర్ ఈ రోజు హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.  అయితే ఈ చోరీ చేసింది మరెవరో కాదని గత కొంత కాలంగా చిరు ఇంట్లో సర్వర్ గా పనిచేస్తున్న చెన్న‌య్య అని అనుమానిస్తున్నారు. 

ఈ చోరీ త‌రువాత ఆ వ్య‌క్తి క‌నిపించ‌కుండా పోయాడు. చిరంజీవి ఇంట్లో ప‌నిచేసే చెన్న‌య్య అనే వ్య‌క్తి కోసం గాలించిన పోలీసులు చివ‌ర‌కు ఆయ‌న‌ను ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: