ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న రామ‌య్యా వ‌స్తావ‌య్యా చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకొంది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆ సినిమాకి త్వర‌లోనే గుమ్మడికాయ కొడ‌తార‌ని అంటున్నారు. అందుకే ఎన్టీఆర్ త‌దుప‌రి సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శక‌త్వంలో ర‌భ‌స సినిమా చేయ‌డానికి సిద్ధమ‌వుతున్నాడ‌ని తెలుస్తోంది. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. వ‌చ్చే వారంలోనే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌ని చిత్రబృందం భావిస్తోంద‌ట‌.

అయితే ఈసినిమాకి పెట్టిని టైటిల్‌ని మార్చేయాల‌ని ఎన్టీఆర్ ద‌ర్శకుడికి చెప్పార‌ట‌. ర‌భ‌స అనే పేరు అంత‌గా న‌చ్చలేద‌ని మ‌రింత ఘాటుగా ఉండేలా చూడాల‌ని అన్నాడ‌ట‌. అందుకే ఇప్పుడు ఆ టైటిల్ స్థానంలో మ‌రొక ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ పెట్టేందుకు చిత్రబృందం క‌స‌ర‌త్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

రామ‌య్యా వ‌స్తావ‌య్యా అనే ఓ సాఫ్ట్ టైటిల్ పెట్టి ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా తీస్తున్నాడు హ‌రీష్‌శంక‌ర్. క‌థ‌కు త‌గ్గట్టుగా అలా పెట్టార‌ని తెలుస్తోంది. అందుకే త‌దుపరి సినిమాకైనా మాస్‌ని ఆక‌ట్టుకొనేలా ఓ మాంచి టైటిల్ పెట్టాల‌ని ఎన్టీఆర్ భావిస్తున్నార‌ట‌. ఈ సినిమాలో ఆయ‌న ఓ ప్లేబాయ్ త‌ర‌హా పాత్రని పోషించ‌బోతున్నారు. స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: