అఖిలాంధ్ర ప్రదేశ్ ను తెలంగాణ, సీమాంద్రాగా విభజిస్తూ నిన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకోవడంతో మన రాష్ట్రం మరి కొద్ది రోజులలో రెండు ముక్కలుగా విదిపోబోతోంది. ఈ పరిమాణాల నేపధ్యంలో తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకుంటు ఉంటే సీమాంద్ర ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.  అయితే  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ పరిస్థుతులు ఏమి తమకు పట్టవు అన్నట్లుగా తమదైన రీతిలో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రం రెండు ముక్కలైనా పవన్ ఫ్యాన్స్ మాత్రం ఐకమత్యంగా  ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.

తాము  తెలంగాణకు చెందిన వారం కాదు అలాగే  ఆంధ్రకు చెందిన వారం కూడా కాదు అంటూ తామంతా  ‘పవనిజం' కాన్సెప్టుతో ముందుకు సాగుతాం అంటూ సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్స్ లో తమ భావాలను ప్రచారం చేస్తున్నారు.  అంతేకాదు తమకు ఈ  గొడవలు, తిట్టుకోవడాలు వద్దు అంటూ తమ మతం, బాష,  కులం,  ప్రాంతం అంతా ఒక్కటే అని చెప్పడమే కాకుండా తామందరం ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ ఒక్కటే ‘జై పవనిజం’  అంటూ ఒకరికొకరు మెసేజ్‌లు పంపించుకుంటున్నారు.

ఇలాంటి పరిణామాలుఈ పరిస్థుతులలో రావడం ఈ రెండు ప్రాంతాల అభిమానుల మధ్య మంచి స్నేహ పూరిత వాతావరణానికి దారి తీస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పవనిజానికి ఇంత ఇమేజ్ ఉంది కాబట్టే వెబ్ మీడియాలో టాలీవుడ్ కు సంబందించి అత్యధికంగా నెటిజన్లు వార్తలు చూసే ఏకైక సెలిబ్రేటి స్థాయికి పవన్ కళ్యాణ్ అంతటి స్థాయికి ఎదిగాడు. అందుకే పవన్ క్రేజ్ అతడి సినిమాల జయాపజయాలతో సంబందం లేకుండా ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీ గానే ఉంటాయి.... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: