పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన పైసా వసూల్ బాలయ్య ఫాన్స్ తో పాటు పూరీ ఫాన్స్ ని కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. కొత్త సినిమా మెహబూబా తో తన కొడుకుని హీరోగా పెట్టిన పూరీ జగన్నాథ్ ఈ సినిమా మీద చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఫుల్ బిజీ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా నడుస్తోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వెళుతున్నారు.

ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కన్నడలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోన్న ఈ అమ్మాయి, ఒక్కసారిగా పూరీ మూవీలో ఛాన్స్ కొట్టేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

అయితే ఈ ఛాన్స్ వెనకాల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉంది అనే టాక్ ఉంది. నేహా శెట్టి బాయ్ ఫ్రెండ్ అమన్ అనే కుర్రాడు రకుల్ ప్రీత్ కి సొంత తమ్ముడు. నేహా - అమన్ లు ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు, అందుకే పూరీ ని రికమెండ్ చెయ్యమని అమన్ ద్వారా నేహ కోరడం వెంటనే రకుల్ ఆమెని ఆడిషన్ కి రమ్మని అడగడం అలా అలా అమన్ రకుల్ చెవిలో ఓ మాట వేయడం .. రకుల్ .. పూరీకి సిఫార్స్ చేయడం జరిగిందట.

అలా రకుల్ సిఫార్స్ మేరకే 'మెహబూబా'లో నేహాశెట్టికి ఛాన్స్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో నేహా శెట్టి ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: