నేను చావలేదు..బ‌తికే వున్నా...న‌మ్మండి బాబోయ్ అంటోంది సినీ న‌టి క‌న‌క‌. అల‌నాటి న‌టి దేవిక కూతురైన క‌న‌క క్యాన్సర్ తో బాద‌ప‌డుతూ మంగ‌ళ‌వారం చ‌నిపోయింటూ ఎవ‌రో వ‌దంతులు పుట్టించారు. ఎవ‌రో ఆక‌తాయి క్రియేట్ చేసిన వార్త క్షణాల్లో దావ‌నంలా మారింది. దీంతో ఆమె బంధువులు కూడా ఆందోళ‌న చెంది క‌న‌క‌కు ఫోన్ చేసి మ్యాట‌ర్ చెప్పేశారు. విష‌యం లేట్ గా తెలుసుకున్న న‌టి క‌న‌క ప్రెస్ మీట్ పెట్టి నాకు క్యాన్సర్ వున్న మాట వాస్తవ‌మే..అయిన‌ప్పటికీ నాకు భ‌యం లేదు. బ‌ట్ నేను చావ‌లేదు. ద‌య చేసి వ‌దంతులు న‌మ్మోద్దు అంటూ క‌న‌క అభిమానుల‌ను కోరింది.

అంతేకాదు వ్యక్తిగత కార‌ణాల వ‌ల్లే సినిమాల‌కు కాస్త దూర‌మ‌య్యాన‌ని, త్వర‌లో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలిపింది. గతంలో మ‌ళ‌యాళంలో మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్ లాంటి టాప్ స్టార్స్ తో ఇటు తెలుగులో రాజేంద్ర ప్రసాద్ తోనూ ఓ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక నేను బ‌తికే వున్నాను అని మీడియా ముందుకు రావ‌డంతో అమ్మయ్యా క‌న‌క బ‌తికే వుందని అంద‌రూ గాలి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: