పవర్ స్టార్ పవణ్ కళ్యాణ డేంజర్ డిసిషన్ తీసుకున్నాడని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ నిర్ణయం తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు తన పవర్ పై ఎలాంటి ప్రభావం చూపవని, తన ‘అత్తారింటికి దారేది’ సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకే విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

రాంచరణ్ సినిమా ‘ఎవడు’ తెలంగాణ నిర్ణయం కారణంగా సీమాంధ్రలో అల్లర్లతో బంద్ లు, ఇతరత్రా గొడవలతో కలెక్షన్లపై తీవ్రప్రభావం చూపుతుందని భావించి స్వయంగా కేంద్రమంత్రి చిరంజీవే నిర్మాత దిల్ రాజుతో మాట్లాడి దానిని ఆగస్టు 21కి వాయిదా వేయించిన సంగతి తెలిసిందే.

దీంతో త్రివిక్రమ్ కూడా ‘ అత్తారింటికి దారేది’ సినిమాను వాయిదా వేస్థారని ప్రచారం జరిగింది. అయితే ‘ఎవడు’ సినిమా వాయిదాతో బోలెడు ధియేటర్లు దొరుకుతాయని, తెలంగాణలో జనం మంచి మూడ్ లోనే ఉన్నందున తెలంగాణలో మంచి కలెక్షన్లకు అవకాశం ఉంటుందన్న భావనకు నిర్మాతతో సహా పవణ్ కూడా వచ్చారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సీమాంధ్రలో లొల్లి సినిమాలపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చు అని కూడా పవణ్ భావిస్థున్నారట.

అయితే చిరంజీవి సోదరుడు పవణ్, అసలే చిరంజీవిపై సీమాంధ్ర అగ్గిమీద గుగ్గిలం అవుతోంది, గతంలో ఇలా రాజకీయం సినిమాలను అడ్డుకునేంత వరకు వెల్లిన సంగతి తెలిసిందే. అందుకే ఎంత తన పవర్ మీద నమ్మకం ఉన్నా... జనం పవర్ ను ఈజీగా తీసుకుని పవణ్ డేంజర్ నిర్ణయం తీసుకున్నాడేమో అంటున్నాయి సినిమా వర్గాలు. సరే ఇంకా సమయం ఉంది కాబట్టి ఏమైనా జరగొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: