యువరత్న నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత స్పీడ్ పెంచి వేగంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. శాతకర్ణి తర్వాత సెప్టెంబర్లో తన 101వ సినిమా పైసా వసూల్తో థియేటర్లలోకి దిగాడు. పైసా వసూల్ అలా రిలీజ్ అయ్యిందో లేదో వెంటనే బాలయ్య కోలీవుడ్ సీనియర్ దర్శకుడు కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తన 102వ సినిమాను పట్టాలెక్కించేశాడు.
జై సింహా టైటిల్తో వస్తోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి దిగనుంది. అయితే ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ చిత్రయూనిట్ను తీవ్రంగా కలవరపరుస్తోంది. బాలయ్య శాతకర్ణి బాలయ్య కెరీర్లోనే అత్యధికంగా రూ.68 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమాలకు బిజినెస్ పెరగాలి. అయితే పైసా వసూల్ సినిమా ఘోరమైన డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు ఆ ప్రభావం జై సింహా బిజినెస్కు భారీగా ఎఫెక్ట్ పడింది.
పైసా వసూల్ చిత్రానికి దాదాపు రూ.33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా అట్టర్ప్లాప్ కావడంతో ఈ సినిమాకు మొత్తంగా రూ.20 కోట్లకు కాస్త అటూ ఇటూగా షేర్ వచ్చింది. పైసా వసూల్ బయ్యర్లు రూ. 13 కోట్ల వరకు నష్టపోయారు. దీంతో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ బాలయ్య జై సింహా ప్రి రిలీజ్ బిజినెస్పై భారీగా పడింది.
పైగా సంక్రాంతి బరిలోకి దిగుతోన్న ఈ సినిమా పండగ సీజన్లో రిలీజ్కు రెడీగా ఉన్న పవన్ అజ్ఞాతవాసితో పాటు మిగిలిన సినిమాల పోటీని ఎలా తట్టుకుంటుందో ? అన్న డౌట్తో ఈ సినిమాను కొనేందుకు బయ్యర్లు ఎవ్వరూ ముందుకు రావడం లేదట. దీంతో టోటల్గా జై సింహా సినిమా యూనిట్ పెద్ద టెన్షన్లో ఉందని తెలుస్తోంది.