నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి స్టార్ట్ అయిన నాని విజయ పరంపర ఏడు సినిమాలుగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం నాని సినిమా వస్తుందంటే పెద్ద హీరోలకు కూడా చెమటలు పడుతున్నాయి. ప్రస్తుతం నాని రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే చిత్రం వచ్చే నెలలో క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. దిల్రాజు నిర్మించడంతో పాటు నాని, సాయి పల్లవి జంటగా నటించడం, ఇప్పటికే ట్రైలర్ దుమ్మురేపుతుండడంతో సినిమాకు అదిరిపోయే క్రేజ్ వచ్చేసింది.
అదిరిపోయే క్రేజ్ రావడంతో ఈ సినిమాకు ఏకంగా శాటిలైట్, డిజిటల్, అన్ని ఏరియాల థియేట్రికల్ రైట్స్ కలుపుకుని రూ.40 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. నాని ఈ యేడాది నటించిన నేను లోకల్ సినిమా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన నిన్ను కోరి యావరేజ్. ఇక ఇప్పుడు దిల్ రాజు బ్యానర్లో వస్తోన్న ఏంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ జరగడం చూస్తుంటే నాని రేంజ్ సినిమా సినిమాకు ఎలా పెరుగుతుందో అర్థమవుతోంది.
ఇక ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు రూ.18 కోట్ల బడ్జెట్ పెట్టారు. ప్రమోషన్లతో కలిపి రూ.20 కోట్ల వరకు ఖర్చవుతోంది. మరి రిలీజ్కు ముందే రూ.40 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగడంతో టాలీవుడ్ స్టార్ హీరోలకు సైతం షాక్ ఇచ్చే విషయం. ఇక రిలీజ్కు ముందే భారీ లాభాలు మూటకట్టుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజ్లో వసూళ్లు కొల్లగొడుతుందో ? చూడాలి.