చాలా సంవత్సరాల తర్వాత అక్కినేని నాగార్జున, వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మల కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. ఇక ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకులతో పాటు, సినీ వర్గాల అందరి దృష్టి ఉంది. అందుకే ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నాగార్జున మరియు వర్మలు తీసుకుని చేస్తున్నారు.
ఈ చిత్రం స్థాయిని పెంచేందుకు అమితాబచ్చన్ను గెస్ట్గా ఈ చిత్రంలో నటింపజేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన చర్చలు వర్మ చేశాడు అంటూ వార్తలు రావడంతో తెలుగు ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలను వర్మ కొట్టి పారేశాడు. ప్రేక్షకుల సంతోషంపై నీళ్లు జల్లారు. రామ్ గోపాల్ వర్మ తమ చిత్రంలో అమితాబ్ నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేశాడు.
అసలు అలాంటి ప్రస్థావన రాలేదని, తాము బిగ్బిని సంప్రదించలేదని, ఆయనకు తగ్గ పాత్ర మా సినిమాలో లేనే లేదు అంటూ వర్మ క్లారిటీ ఇవ్వడంతో ప్రేక్షకులు ఉసూరుమంటున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను వచ్చే వేసవి కానుకగా విడుదల చేసేందుకు నాగార్జున మరియు వర్మలు ప్లాన్ చేస్తున్నారు. వర్మ స్వయంగా ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తుండటం చెప్పుకోదగ్గ విషయం.
ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా టబు నటిస్తుందని టాక్. ఇక ఈ చిత్రంలో నాగ్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడని తెలిపోయింది. రాజు గారి గది-2 తర్వాత నాగార్జున చేస్తున్న ఈ సినిమా అది కూడా ఆర్జివి కాంబోలో అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. మరి ఆ అంచనాలను సినిమా అందుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.