తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి అరడజను మంది హీరోలు వచ్చారు.  అయితే మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ సంపాదించింది..కేవలం పవన్ కళ్యాన్ మాత్రమే.  అన్నబాటలో నడుస్తూ..రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.  ‘జనసేన’ అనే పార్టీ స్థాపించి ప్రజల తరుపు నుంచి పోరాడుతున్నారు.  ఓ వైపు సినిమాలు..మరోవైపు రాజకీయాలు చూసుకుంటున్న పవన్ కళ్యాన్ తన ఆప్త మిత్రుడు అయిన ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  'అజ్ఞాతవాసి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
Image result for pawan agantavasi
ఈ చిత్రంలోని పాట రీసెంట్ గా రిలీజ్ అయి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  ప్రస్తుతం ‘అజ్ఞాతవాసి’ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది..అంతా కుదిరితే..సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు.  మరోవైపు మెగాస్టార్ తనయుడు రాంచరణ్ నటిస్తున్న 'రంగస్థలం' షూటింగ్ కంప్లీట్ చేసుకొని సంక్రాంతికి సిద్ధం చేయాలని నిర్మాతలు భావించారు.  ఈ మేరకు డిసెంబర్ మొదటి వారానికే తొలి కాపీని సిద్ధం చేసి ప్రమోషన్ పనులు ప్రారంభించాలని భావించారు.
Related image
'అజ్ఞాతవాసి' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, రామ్ చరణ్ 'రంగస్థలం' విడుదలను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.  ఒకే సమయంలో మెగా హీరోల సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ ఇబ్బంది పడతారని తెలుసుకున్న రాంచరణ్ బాబాయి కోసం పెద్ద త్యాగం చేసినట్లు సినీ ఇండస్ట్రీ సమాచారం. 
Image result for rangasthalam
‘రంగస్థలం’ లో రాంచరణ్, గుబురు గడ్డంతో న్యూలుక్ లో కనిపించనున్నాడు. ఇక ఇందులో చరణ్ బదిరుడిగా కనిపిస్తాడని కూడా మరో వార్త హల్ చల్ చేస్తోంది.  ఫిబ్రవరి వరకూ 'సైరా' నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకోవాలని చరణ్ భావిస్తున్నాడట. ఇక బాబాయ్, అబ్బాయ్ ల సినిమాలు ఒకేసారి బరిలోకి దిగవని తెలుస్తుండటంతో మెగా అభిమానుల్లో కూడా ఆనందం కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: