టాలీవుడ్ లో ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.  ఈ ఏడాదిలో వరుసగా ఐదు హిట్ సినిమాలు అందుకున్న నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం తను నిర్మించిన ఆరో చిత్రం ఎంసిఏ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం శతమానంభవతి సినిమాతో మంచి పేరు సంపాదించారు సతీష్ వేగేశ్న. ఎప్పటినుండో దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం సినిమా చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. 


సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం సినిమా దిల్ రాజు తన బ్యానర్‌లో నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. దిల్ రాజుకి హీరో మాత్రం దొరకడం లేదు. రాజ్ తరుణ్, సాయి ధరం తేజ్ వంటి హీరోల పేర్లు వినిపించినప్పటికీ ఎవరిని ఖరారు చేయలేదు. ఆ మద్య నాగార్జున, ఎన్టీఆర్ లను కూడా కలిశారు.. కానీ వర్క్ ఔట్ కాలేదు. తాజాగా దిల్ రాజు కి హీరో దొరికాడట.. గతంలో దిల్ సినిమాతో ఇద్దరి కెరీర్ లు మలుపు తిరిగిన విషయం తెలిసిందే. 


త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఇటీవల లై చిత్రంతో నిరాశ పడ్డ నితిన్ ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన తరువాత దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా మరో శతమానం భవతి అవుతుందని అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. అ ఆతో అదిరిపోయే హిట్ అందుకున్న నితిన్ ఈ సినిమాతో కూడా కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: