నటుడు రచయిత దర్శకుడు పోసాని కృష్ణమురళీ తన నటనలోనే కాకుండా తన విలక్షణమైన వ్యక్తిత్వంతో ఎప్పుడూ సంచలన వార్తలకు కేంద్ర బిందువుగా ఉంటాడు. ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంగా మాట్లాడే పోసాని ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ చిరంజీవి కమల్ హాసన్ ల పై తన అభిప్రాయాలను ఎటువంటి మొహమాటం లేకుండా వివరించి అందరికీ షాక్ ఇచ్చాడు. పవన్కళ్యాణ్  రాజకీయాలకు తాను మద్దతు ఇవ్వను అంటూ వైఎస్ జగన్‌కు మాత్రమే సపోర్ట్ ఇస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

అంతేకాదు గడపగడపకు వెళ్ళి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించిన వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి అవుతాడు అంటూ పవన్ కళ్యాణ్ సరైన వ్యక్తి అని ప్రజలు భావిస్తే ముఖ్యమంత్రి అవుతాడు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు పోసాని. ఇదే సందర్భంలో బుల్లితెర ప్రొగ్రాంలకు డబ్బు ఇస్తేనే తాను వస్తాను అంటూ తనపై వస్తున్న కామెంట్స్ పై స్పందిస్తూ యాంకర్ సుమ ఓంకార్ ఖుష్భూ లాంటి వాళ్ళు డబ్బులిస్తేనే వస్తాను అని చెప్పడం లేదా అని ఎదురు ప్రశ్నలు వేస్తునాడు పోసాని. 

తాను  చాలామందికి తన డబ్బుతో గుండె ఆపరేషన్లు చేయించిన విషయాన్ని చెపుతు తానూ జనాన్ని చెడగొట్టే పాన్ పరాగ్ కార్యక్రమాలకు ఇతర వ్యాణిజ్యమైన కార్యక్రమాలకు డబ్బుకోసం వెళ్ళడంలేదు అంటూ కామెంట్స్ చేసాడు తాను కులం పేరుతో ఓట్లు అడగలేదు అని చెపుతూ జీఎస్టీ పై డైలాగులు చెప్పిన హీరో విజయ్ లాంటి హీరోల దగ్గర బ్లాక్ మనీలేదా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు. తాను డబ్బులు సంపాధించడానికే టెలివిజన్ పరిశ్రమలోకి వచ్చాను అంటూ టెలివిజన్ రంగంలో శృంగారం బూతులు ఎక్కువడం అభ్యంతరకరం కాదు ప్రజలు చూస్తున్నప్పుడు మనమెవ్వరం అడ్డు చెప్పడానికి అంటూ బుల్లితెర షోలకు తన మద్దతుప్రకటించాడు. 

చిరంజీవి చాలా మంచి మనిషి. అయినప్పటకి అతడికి ఉన్న మధ్యతరగతి మనస్తత్వం వాళ్ళ రాజకీయాలలో రాణించలేదు అని అభిప్రయా పడ్డాడు కమల్ హాసన్ ఒక మానసిక రోగి అంటూ రోజుకోసారి మాట మార్చేవాడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను ఎలా ఉద్దరిస్తాడు అంటూ కమల్  పై ధ్వజమెత్తుతూ ఆయనకు ఎంతమంది భార్యలు అంటూ ఆవేశంగా ప్రశ్నించాడు. పోసాన్ని ఇలా తన ఆవేశాన్ని కొనసాగిస్తూ ఎందరినో టార్గెట్ చేసిన ఈ ఇంటర్వ్యూలోని అంశాలు ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: