డైరెక్టర్ సుకుమార్ సినిమా అనగానే విభిన్నత కి  మారు పేరు అని అందరూ అంటూ ఉంటారు. ఆయన ఎంచుకునే జోనర్ లు పూర్తిగా డిఫరెంట్ ఉంటాయి అని చూడగానే చెప్పవచ్చు. ఆర్య తరువాత ఆ రేంజ్ లో ప్రేమ కథ ఒక్కటీ తీయలేదు ఆయన. 100 % లవ్ సినిమాలో ప్రేమ ఉన్నా అది అమర కావ్యం కాదు ఆర్య లాగా.

వన్ నేనొక్కడినే కూడా చాలా డిఫరెంట్ సినిమా. ఇప్పుడు రంగస్థలం కోసం తన జోనర్ మార్చాడు సుకుమార్ అంటున్నారు. రంగస్థలం అనగానే ఇదేదో నాటకాల సినిమా అనుకున్నవారు చాలామందే ఉన్నారు.

రామ్ చ‌ర‌ణ్ చెవిటివాడి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌న్న ప్ర‌చారం కూడా సాగింది. అయితే… అదేం కాదు. ఇదో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా. ఇప్పుడు జోన‌ర్ ఏంట‌న్న‌ది కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ సినిమా రాజ‌కీయాల నేప‌థ్యంలో సాగుతుంద‌ట‌. కుర్చీ కోసం.. ఎవ‌రెన్ని ఎత్తులు వేశారో, ఎవ‌రు చిత్త‌య్యారో ఈ సినిమాలో చూపించ‌బోతున్నాడ‌ట డైరెక్టర్ సుకుమార్. పల్లెటూరు రాజకీయాల నేపధ్యం లో రంగస్థలం కథ నడుస్తుంది అనీ ఈ సినిమా విషయం లో సుకుమార్ అద్భుతమైన ట్విస్ట్ లు ఉన్న స్క్రిప్ట్ రాసాడు అనీ అంటున్నారు. డిసెంబ‌రు నాటికి చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌వుతుంది. మార్చిలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: