ఎవరూ ఊహించని విధంగా రాజమౌళి ఇచ్చిన స్వీట్ షాక్ కు మెగా నందమూరి అభిమానులు జోష్ లో ఉన్నారు. రామ్ చరణ్ జూనియర్ లమధ్య రాజమౌళి కూర్చుని ఉన్న ఒక ఫోటోను జక్కన్న తన ట్విటర్ లో పోస్ట్ చేసాడు. అయితే ఈ ఫోటో ఎదో ఒక ఫిలిం ఫంక్షన్స్ కు సంబంధించింది కాదు. జూనియర్ చరణ్ లు అత్యంత సన్నిహితంగా రాజమౌళితో కలిసి తీయించుకున్న ఒక లేటెస్ట్ ఫోటో ఇది.  

ఇప్పుడు ఈ ఫోటో జూనియర్ చరణ్ ల అభిమానులలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడ వైరల్ గా మారింది. ఇప్పుడు ఇంత ప్రత్యేకంగా రాజమౌళి జూనియర్ చరణ్ లతో తన స్నేహాన్ని తెలియచేస్తూ ఈఫోటోను ఎందుకు తన ట్విటర్ లో షేర్ చేసాడు అన్న విషయమై అనేక ఆసక్తికర కథనాలు అప్పుడే మొదలైపోయాయి. 

రాజమౌళి ‘బాహుబలి 2’ తరువాత తీయబోయే సినిమాకు సంబంధించి హీరో ఎవరు అన్న విషయమై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాజమౌళి కొత్త సినిమాకు సంబందించిన కథ ఇంచుమించు ఫైనల్ కావడంతో ఆసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన జనవరిలో ఉంటుంది అన్న వార్తలు కూడ గుప్పుమంటున్నాయి. ఈ నేపధ్యంలో రాజమౌళి వ్యూహాత్మకంగా జూనియర్ చరణ్ లతో కలిసి తాను తీయించుకున్న లేటెస్ట్ ఫోటోను షేర్ చేయడం ద్వారా తాను తీయబోయే లేటెస్ట్ మూవీ జూనియర్ చరణ్ లతో తీయబోతున్న మల్టీ స్టారర్ అని సంకేతాలు ఇస్తున్నాడు అని అంటున్నారు.

‘బాహుబలి’ ప్రాజెక్ట్ తరువాత రాజమౌళి తీయబోతున్న సినిమాకాబట్టి ఈసినిమా రేంజ్ పై కూడ అంచనాలతో పాటు కలక్షన్స్ రికార్డుల పై అత్యంత భారీ స్థాయి అంచనాలు ఉంటాయి. ఈ విషయాలు అన్నీ చేరుకోవాలి అంటే చరణ్ జూనియర్ ల కలయికతో కూడిన మల్టీ స్టారర్ వల్లే జరుగుతుందని రాజమౌళి ఈ ట్విస్ట్ ఇచ్చినట్లు అనుకుంటున్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఈ మల్టీ స్టారర్ ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. ఏమైనా ఒక సునామి లాంటి మల్టీ స్టారర్ నిర్ణయానికి సంబంధించిన రాజమౌళి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: