సుకుమార్ రాం చరణ్ కలిసి చేస్తున్న రంగస్థలం 1985 సినిమా సెట్స్ మీద ఉంది. పల్లెటూరి ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాతో సుకుమార్, చరణ్ పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. 80వ దశకంలో కథతో గ్రామ రాజకీయాల గురించి ఇందులో ప్రస్తావించబోతున్నారని టాక్. ఇప్పటికే చరణ్ లుక్ మెగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తుండగా సినిమా రాజకీయాల గురించి సినిమా చేస్తున్నాడనగా అంచనాలు పెరిగాయి.


సుకుమార్ తన రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఈ రంగస్థలం చాలా క్లీన్ గా చేస్తున్నాడట. దీనికోసం సెపరేట్ క్రియేటివ్ టీం ఏర్పాటుచేశాడట. అంతేకాదు సుకుమార్ మార్క్ లవ్ స్టోరీకి ఈ సినిమాలో స్కోప్ ఉందని తెలుస్తుంది. రాం చరణ్, సమంతల మధ్య లవ్ స్టోరీ సినిమాకు ఆయువు పట్టు అంటున్నారు. ఆర్య, ఆర్య2 తో తన లవ్ స్టోరీ సత్తా ఏంటో చూపించిన సుకుమార్ చరణ్ రంగస్థలంలో కూడా ఎమోషన్ తో నిండిన ప్రేమకథ ఉంచబోతున్నాడట.


ఇక సినిమాలో హాట్ యాంకర్ అనసూయ కూడా స్క్రీం షేర్ చేసుకుంటుందని తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దాదాపు 50 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉంటాయని తెలుస్తుంది. 2018 మార్చి నెలలో రిలీజ్ ప్లాన్ చేయబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో రిలీజ్ చేస్తారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: