పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘అజ్ఞాతవాసి’ యూరప్ షెడ్యూల్ ముగించుకుని పవన్ ప్రస్తుతం లండన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈసినిమాకు సంబంధించిన యూరప్ షెడ్యూల్ లో చిత్రీకరించిన మూడు పాటల విషయంలో మరికొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించి కొన్నికొన్ని చోట్ల త్రివిక్రమ్ కు అసంతృప్తి ఏర్పడినట్లు టాక్.

దీనితో తనకు అసంతృప్తి కల్గించిన ఆ సీన్స్ ను మళ్ళీ రీ షూట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో త్రివిక్రమ్ ఉన్నట్లు ప్రస్తుతం గాసిప్పుల హడావిడి చేస్తున్నాయి. వాస్తవానికి పవన్ లండన్ లోనే ఉన్నాడు కాబట్టి తిరిగి కొన్ని సీన్స్ కు సంబంధించి యూరప్ లో మరో రీషూట్ చేస్తే అన్ని విధాల బాగుంటుందని త్రివిక్రమ్ పవన్ పై ఒత్తిడి పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పటికే పవన్ ‘అజ్ఞాతవాసి’ షూటింగ్ ను పూర్తి చేయడానికి నవంబర్ 25వ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టిన నేపధ్యంలో మరొకసారి కొన్ని సన్నివేశాల రీ షూట్ అంటే పవన్ అంగీకరించడం లేదు అన్న వార్తలు కూడ గాసిప్పులుగా హడావిడి చేస్తున్నాయి. కానీ త్రివిక్రమ్ ఈమూవీకి ఉన్న భారీ అంచనాల రీత్యా కొన్ని అవసరమైన సీన్స్ రీ షూట్ చేస్తేనే అన్ని విధాల మంచిది అని త్రివిక్రమ్ పవన్ పై సున్నితమైన ఒత్తిడి చేస్తున్నట్లు టాక్.

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన బడ్జెట్ అంచనాలు దాటిపోయింది అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో మరొకసారి కొన్ని కీలక సన్నివేశాల రీషూట్ అంటే ఈసినిమా బడ్జెట్ ను మరింత పెంచుతుంది అనే కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. అయితే 150 కోట్ల బిజినెస్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈమూవీ బయ్యర్లు అందరూ లాభ పడాలి అంటే 200 కోట్ల కలక్షన్స్ రావాలి అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ అంచనాల టెన్షన్ వల్లనే త్రివిక్రమ్ ఈసినిమాకు సంబంధించిన ప్రతి సీన్ లోను అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: