టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో సంచలనాత్మక చిత్రాలు తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ తాజాగా కింగ్ నాగార్జునతో చాలా కాలం తర్వాత ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రానికి సంబంధించిన  ఈ సినిమా షూటింగ్‌ను సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభించారు. గత కొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాలకు చిరునామా రాంగోపాల్ వర్మ. సినీ పరిశ్రమ నుంచి రాజకీయ నాయకుల వరకు.. ఎవ్వరినీ వదలకుండా అందరిపైనా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఆర్జీవీ వివాదలకు తెరలేపుతుంటారు.
Image result for nagarjuna ram gopal varma shooting hyderabad
అయితే ఇతరులపైనే కాదు ఆయనపై స్వయంగా సెటైర్లు వేసుకోవడం కూడా ఆర్జీవీకి అలవాటే.  28 ఏళ్ల క్రితం వర్మ-నాగ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘శివ’సినిమా ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది.  చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి.  హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ముహూర్తపు షాట్ షూట్ చేశారు.  ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ ఎన్నో విషయాలు మాట్లాడారు. ‘గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది అంటున్నారు.

రాంగోపాల్ వర్మకి మైండ్ దొబ్బింది.. జ్యూస్ అయిపోయింది అని అందరూ అన్నారు. దాంట్లో మైండ్ దొబ్బింది అన్నమాట మాత్రం నిజం. కానీ జ్యూస్ అయిపోయిందా లేదా అనేది ఈ సినిమా తరవాత చూస్తారు’ అని వర్మ తన స్టైల్లో చెప్పుకొచ్చారు.  చాలా కాలం తర్వాత నాగార్జునకు ఓ కథ వినిపించాను..దానికి ఆయన చాలా ఎమోషన్ గా ఫీల్ అయ్యారు.  నాగార్జున రియాక్షన్‌తో నాకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది’ అని వర్మ చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: