మెగా అభిమానులకు చిరంజీవి చరణ్ పట్ల మాత్రమే కాకుండా ఆ కుటుంబం నుండి వచ్చిన యంగ్ హీరోలను కూడ బాగా ఆదరిస్తున్నారు. దీనితో ఈ యంగ్ హీరోల సినిమాలకు కూడ మంచి ఓపెనింగ్స్ తో పాటు కలక్షన్స్ వస్తున్నాయి. మెగా మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ మెగా అభిమానులలో తన పట్టును పెంచుకోవడానికి అనునిత్యం చిరంజీవి పవన్ ల నామస్మరణ చేయడం అలవాటుగా మారింది. 

దీనిని మరింత కొనసాగిస్తూ తేజు ఈమధ్య తన అభిమానులను వ్యక్తిగతంగా కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక సమావేశం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ తన లేటెస్ట్ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‎లోని గచ్చిబౌలిలో జరుగుతున్న నేపధ్యంలో అక్కడకు వచ్చిన తన అభిమానులందరినీ సాదరంగా ఆహ్వానించడమే కాకుండా వారికి భోజనాలు కూడ పెట్టించి వారితో కొంత సమయం గడుపుతూ వారి కష్ట సుఖాలు విన్న సందర్భాన్ని చూసినవారు చిరంజీవి మేనల్లుడుగా తేజు కూడ తన అభిమానులతో మంచి సంబంధాలు కొనసాగించే సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఆసందర్భంలో తనను చూడటానికి ఎంతో దూరం నుంచి వచ్చిన ఒక కాళ్ళు లేని వికలాంగుడుతో తేజు కూడ మోకాళ్ళ పై ఆ వికలాంగుడుతో సరిసమానంగా కూర్చుని తీయించుకున్న ఫోటో మెగా అభిమానుల మన్ననలను పొందుతోంది. దీనితో చాలామంది అభిమానులు పోలికల్లోనే కాదు ఆచరణలో కూడ సాయి ధరమ్ తేజ్ చిరంజీవి పవన్ కళ్యాణ్ లను అనుసరిస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అంతేకాదు మరికొందరైతే సాయి ధరమ్ కు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసు అంటూ పవన్ డైలాగ్ ను అన్వయిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈమధ్య కాలంలో ఈ మెగా యంగ్ హీరో సినిమాలు అన్నీ వరస పరాజయాలుగా మారుతున్న నేపధ్యంలో డిసెంబర్ 1న విడుదల కాబోతున్న ‘జవాన్’ సక్సస్ కు సహకరించమని తేజు చేసిన అభ్యర్ధనను మెగా అభిమానులు ఎంత వరకు ఆచరిస్తారో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: