భారత్లో శ్రీ రాజపుత్ కర్ణి సేన నిరసనలు, సి బి ఎఫ్ సి - భారతీయ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయటంలో తాత్సారం నడుమ పద్మావతి చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. 190 కోట్ల రూపాయిల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించగా, దీపిక పదుకొనే, షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్లు ప్రధాన పాత్రలు పోషించారు.
అయితే చిత్రాన్ని గ్రేట్ బ్రిటన్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరని తెలుస్తోంది. భారత్ లో కూడా విడుదలకు అడ్డంకులు తొలిగిన తరవాతే ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ నిర్మాతలు తమ ప్రకటనలో తెలిపారు.
సంజయ్ లీలా బన్సాలి కథలో చేసిన మార్పేమన్ టే అల్లావుద్దీన్ ఖిల్జీ పద్మావతి కోసం కాకుండా, పద్మావతే అల్లావుద్దీన్ ఖిల్జీ పొందు కోసం కలలు కంటున్నదని, తన కలలో అల్లావుద్దీన్తో ఆమె సరససల్లాపాలాడే ఒక సన్నివేశం చిత్రంలో వున్నదని ఆ చిత్ర వ్యతిరేకుల వాదన కాగా, అలాంటి సన్నివేశమే చిత్రంలో లేదని సంజయ్ భన్సాలీ సమాదానం. సంజయ్ నిజం గా కథని వక్రీకరిస్తే ఇప్పుడు మౌనంగా ఉన్నవారు కూడా ప్రమాదకారులే అవుతారు. భారత జాతి విశ్వాసంపై దెబ్బ కొట్టరనే నమ్ముదాం. చివరికి రేపు డిసెంబర్ 1వ తేదీన విడుదల కావలసిన ‘పద్మావతి’ విడుదలను భన్సాలీ నిరవధికంగా వాయిదా వేశాడు.