‘ప్రేమకథ’ సినిమాతో హీరోగా పరిచియం అయిన సుమంత్ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఉండరు. అక్కినేని మనవడుగా ఇతడిని టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసింది అక్కినేని నాగార్జున. అయితే  ఆ తర్వాత సుమంత్ కెరియర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. సుమంత్ నటించిన ఒక్క ‘సత్యం’ సినిమా తప్ప మిగతా సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. అక్కినేని కుటుంబం ముఖ్యంగా నాగార్జున  సమంత్ ను హీరోగా నిలబెట్టే ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి ఏమి కలిసి రాలేదు. 

ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతున నేపధ్యంలో సుమంత్ నటించిన ‘మళ్ళీ రావా’ మూవి గతవారం విడుదలై విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొందింది. ఈసినిమాకు ఏ క్లాసు సెంటర్లలో కూడ మంచి టాక్ రావడంతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈమూవీని ప్రమోట్ చేస్తూ సుమంత్ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమాను   నిలబెట్టే ప్రయత్నంచేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో ఒక మీడియా సంస్థకు సుమంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మేనమమ నాగార్జున పై  షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

తనకు నాగార్జునకు పడదని అదేవిధంగా తమ మధ్య విభేదాలున్నాయని ఏఎన్నార్ మరణానంతరం ఆస్తుల పంపకం దగ్గర తమ ఇద్దరి మధ్య తేడా వచ్చిందన్న రూమర్ల పై స్పందిస్తూ సుమంత్ ఆ రూమర్ల పై క్లారిటీ ఇచ్చాడు. తనకు తన మావయ్యకు విభేదాలున్నాయన్న మాట శుద్ధ అబద్ధమని అని అంటూ అశలు బయట ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నట్లు కూడా తనకు తెలియదని కామెంట్ చేసాడు. 

తాను తన మావయ్యతో రోజూ మాట్లాడతానని అదేవిధంగా తరుచుగా కలుస్తుంటానని చెపుతూ గతంతో పోలిస్తే ఇప్పుడు కలవడం కొంచెం తగ్గిన విషయం నిజమే అయినా తామందరం ఒక ఫ్యామిలీ అంటూ ఈ గాసిప్పుల పై క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తనకు అఖిల్ చైతూ రానాలతో మంచి సాన్నిహిత్యం ఉంది అని అంటూ వారితో కలిసి సినిమాలు చేయాలని కూడా తనకు ఉద్దేశం ఉంది అనిఅంటూ మల్టీ స్టారర్స్ కు తాను రెడీ అన్న సంకేతాలు ఇచ్చాడు. అదేవిధంగా తాను క్యారెక్టర్ విలన్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అనిచెపుతూ ప్రస్తుతం తనకు వచ్చిన ‘మళ్ళీ రావా’ విజయాన్ని అవకాశాలుగా మార్చు కోవడానికి ప్రయత్నిస్తున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: