తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని నాగార్జున్. ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించిన నాగార్జున..నటుడిగానే కాకుండి నిర్మాతగా మంచి సక్సెస్ సాధించారు. ఇక భక్తిరస చిత్రాల్లో ఆయన నటనకు జనాలు నీరాజనాలు పలికారు. ప్రస్తుతం నాగార్జున వారసులుగా అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు ఎంట్రీ ఇచ్చారు.
ఇప్పటికే నాగచైతన్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు దాటింది. వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ చిత్రంలో నటిస్తున్నాడు అఖిల్. నిన్న విశాఖలో ఆడియే వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. అఖిల్ను నేను ఎలా చూడాలనుకుంటునానో చెబితే ‘హలో’ కథ రాశాడు విక్రమ్కుమార్. తెలుగు పరిశ్రమకు డాన్స్, గ్రేస్ నేర్పింది నాన్నగారే. అఖిల్ గ్రేస్ చూస్తుంటే అచ్చుగుద్దినట్లు నాన్నగారు అఖిల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ను రీలాంచ్ చేస్తున్నా’’ అని నాగార్జున అన్నారు.
డిసెంబర్ 22న సినిమాను విడుదల చేస్తున్నారు. అనూప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల్ని ఆదివారంలో వైజాగ్లో విడుదల చేశారు.తెలుగు ప్రేక్షకుల్లో లెజెండ్గా నిలిచిన నాన్నగారి చివరి సినిమా ఎలా తియ్యాలి.. అనుకుంటుంటే విక్రమ్ దేవుడిలా వచ్చి ‘మనం’ లాంటి సినిమా ఇచ్చి నాన్నగారిని గొప్పగా సాగనంపాడు. ‘హలో’ ను మూడు రోజుల క్రితమే చూశా. వస్తున్నాం.. బ్లాక్ బస్టర్హిట్ కొడుతున్నాం.. ఇది ఫిక్స్ అన్నారు నాగార్జున.