యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కెరియర్ లో సిం హాద్రి సినిమాకు ఎంతో ప్రత్యేకత ఉంది. నూనూగు మీసల టైంలోనే రికార్డుల చెడుగుడు ఆడిన సినిమా అది. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ సత్తా ఏంటో చాటి చెప్పిన సింహాద్రి అప్పట్లోనే ఎన్నో రికార్డులను సృష్టించింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది.


ఇక ఈ సినిమా కథ లాంటిదే మళ్లీ ఒకటి తారక్ దగ్గరకు వచ్చిందట. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద సినిమాలతో సత్తా చాటుకున్న శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. లాస్ట్ ఇయర్ మహేష్ తో బ్రహ్మోత్సవం డిజాస్టర్ అందించిన శ్రీకాంత్ అడ్డాల అప్పటి నుండి ఎవరికి కనబడలేదు. 


ఫైనల్ గా మళ్లీ ఓ అదిరిపోయే కథతో వచ్చాడట. ఈసారి ఓ కమర్షియల్ సినిమాను తెరకెక్కించే ఉద్దేశంతో సింహాద్రి రిఫరెన్స్ కథను సిద్ధం చేసుకున్నాడట. జై లవ కుశ తర్వాత ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమాకు షురూ చేశాడు. ప్రస్తుతం యూరప్ ట్రిప్ లో ఉండగా అది ముగించుకుని రాగానే త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడట.


శ్రీకాంత్ అడ్డాల ఆల్రెడీ సినిమా కథను ఎన్.టి.ఆర్ కు చెప్పాడట. లైన్ ఓకే అనేశాడట కూడా.. మొత్తానికి మళ్లీ తనలోని మాస్ కోణం బయట పెట్టే క్రమంలో శ్రీకాంత్ అడ్డాలతో జత కట్టబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఆ సినిమా తెరరూపం దాల్చుతుందో లేదో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: