జై లవ కుశ తర్వాత ఎన్.టి.ఆర్ నటిస్తున్న సినిమా త్రివిక్రం డైరక్షన్ లో తెరకెక్కనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో వస్తున్న ఈ సినిమా ముహుర్త కార్యక్రమాలు పూర్తవగా మరికొద్దిరోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. త్రివిక్రం తో మొదటి సారి సినిమా చేస్తున్న తారక్ సినిమాపై ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నట్టు తెలుస్తుంది.


అంతేకాదు ఈ సినిమాలో తారక్ లవర్ బోయ్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఎన్.టి.ఆర్ ను లవర్ బోయ్ గా అంటే ఊహించుకుంటేనే కొత్తగా ఉంది. అయితే త్రివిక్రం డైరక్షన్ లో ఫ్యాన్స్ కు ఈ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారట. ఇక ఈ సినిమా కోసం తారక్ కొత్త లుక్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. కచ్చితంగా ఇది ఎన్.టి.ఆర్ కెరియర్ లో ఓ సెపరేట్ సినిమాగా ఉంటుందని అంటున్నారు. 


ఇన్నాళ్లు పవన్, మహేష్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేసిన త్రివిక్రం కెరియర్ లో మొదటిసారి ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయెల్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. టెంపర్ తర్వాత తన సినిమాల రూటు మార్చిన తారక్ త్రివిక్రం సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.


ప్రస్తుతం యూరప్ ట్రిప్ లో ఉన్న తారక్ అది ముగించుకుని వచ్చాక త్రివిక్రం సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడట. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. లవర్ బోయ్ లుక్ తో తారక్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ అందిస్తాడని అంటున్నారు. మరి క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: