టాలీవుడ్ డైరక్టర్స్ లో త్రివిక్రం శ్రీనివాస్ అంటే విపరీతమైన క్రేజ్. అర్ధవంతమైన సినిమాలను తీసే చాలా తక్కువమంది దర్శకులలో ఆయన ఒకరని బల్ల గుద్ది మరి చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా చేస్తున్న త్రివిక్రం ఆ సినిమా పూర్తి కాకుండానే ఎన్.టి.ఆర్ సినిమా ముహుర్తం పెట్టేశాడు. జై లవ కుశ తర్వాత కొద్దిపాటి గ్యాప్ కోసం తారక్ యూరప్ ట్రిప్ లో ఉన్నాడు.


ఇక ట్రిప్ ముగించుకుని రాగానే త్రివిక్రం తో సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే అనుకున్నారు. ఇంతలోనే ఈరోజు వెంకటేష్ తో త్రివిక్రం సినిమా ఎనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 6గా వెంకటేష్ త్రివిక్రం సినిమా ఉంటుందట. అయితే ఇది ఎన్.టి.ఆర్ సినిమా తర్వాత తెరకెక్కుతుందా లేదా అంతకుముందే వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.


ఎన్.టి.ఆర్ ప్రస్తుతం త్రివిక్రం సినిమా ఒక్కటే కమిట్ అయ్యాడు. వేరే ఎవరికి కనీసం మాట కూడా ఇవ్వలేదు. మరి ఇంతలోనే వెంకటేష్ తో సినిమా అని రాధాకృష్ణ, త్రివిక్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. త్రివిక్రం సినిమాలో లవర్ బోయ్ గా తారక్ కనిపిస్తాడని అంటున్నారు. మరి ఆ సినిమా చూస్తుంటే ఇంకా లేట్ అయ్యేలా కనిపిస్తుంది.


ముందు ఎన్.టి.ఆర్ సినిమా చేశాకే వెంకటేష్ తో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం వెంకటేష్ తేజ డైరక్షన్ లో ఆట నాదే వేటా నాదే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా మూడు నెలల్లో ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: