నేచురల్ స్టార్ నాని, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయ్’ డిసెంబర్ 21న భారీ విడుదలకు రెడీ కావడంతో ప్రస్తుతం ప్రమోషన్స్ వర్క్స్లో బిజీగా ఉంది. అన్నిపనులు పూర్తి కావడంతో ఈ చిత్రం సెన్సార్కి వెళ్లింది. మూవీని చూసిన సెన్సార్ సభ్యులు బాగుందని కితాబు ఇస్తూనే, ఎలాంటి కట్స్ లేకుండా యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో యూనిట్ ఫుల్ఖుషీ లో ఉంది. ఈ ఏడాది దిల్ రాజు బ్యానర్ లో `నేను లోకల్` సినిమాతో హిట్ కొట్టాడు.
ఇప్పుడు ఈ ఏడాది చివరల్లో `ఎంసీఏ` సినిమాతో మరో హిట్ను సాదించబోతున్నాడని నిర్మాత రాజు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన రెండు సాంగ్స్ ఇప్పటికే విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ను రాబట్టాయి. మిగిలిన సాంగ్స్ను డిసెంబర్ 16న (రేపు) వరంగల్ హన్మకొండలో జరిగే ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానుల సమక్షంలో గ్రాండ్గా విడుదల చేయనున్నారు.
కాగా ఈ మూవీపై రిజల్ట్పై ధీమా వ్యక్తం చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. సెన్సార్ సభ్యుల నుండి పాటిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చిత్ర విశేషాలను తెలియజేశారు.ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనుకోవడానికి కారణం.. ఇప్పటికే మా బ్యానర్లో ఐదు సినిమాలు హిట్స్ వచ్చాయి. అన్ని కుదిరితే ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధించాలని అనుకున్నాం.
ఖచ్చితంగా ‘ఎంసీఏ- మిడిల్ క్లాస్ అబ్బాయ్’ హిట్ కొడతాడనే నమ్మకం ఉందన్నారు దిల్ రాజు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటే్శ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్, లక్ష్మణ నిర్మాతలుగా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.