భారతీయ చలన చిత్ర రంగంలో చాలా తక్కువ మంది గొప్ప స్థానం సంపాదించారు.  అలాంటి వారిలో తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ఒకరు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన కోట్లమంది అభిమానం సంపాదించారు.  ప్రస్తుతం రజినీకాంత్ రోబో 2.0, కాలా సినిమాల్లో నటిస్తున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒకప్పుడు రోబో సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో రోబో 2.0 వస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నద్దంగా ఉన్నారు.   ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన హాట్ బ్యూటీ మీ జాక్సన్‌ నటించారు. 
Image result for robo 2.0
ఆ మద్య శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఐ’ సినిమాలో నటించిన అమీ జాక్సన్ ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ తో నటించే అవకాశం దక్కించుకుంది. తాజాగా  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఈ సినిమా కోసం రజనీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.  రజనీ చాలా గొప్ప వ్యక్తి. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. కేవలం వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ చాలా తెలుసుకున్నా. రజనీ చాలా ప్రశాంతంగా ఉంటారు, అంకితభావంతో పనిచేస్తారు అని ఆమె అన్నారు.
Related image
నటుడిగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నా కొత్త నటులను కూడా చాలా గౌరవిస్తూ..వారికి ఎన్నో మెలుకువలు నేర్పుతారని తెగ పొగిడేస్తుంది. ఐ తర్వాత శంకర్‌ దర్శకత్వంలో రెండో సినిమాలో నటించా. అలాంటి దర్శకుడితో పనిచేయడం నటిగా గొప్ప అనుభవం అని అమీజాక్సన్‌ పేర్కొన్నారు. రూ.400 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Image result for robo 2.0
ఈ సినిమాలో  అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి ఛాయలున్న పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇంకా తేదీని ఖరారు చేయలేదు. అయితే ఏప్రిల్‌ 27న 2.ఓ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: