దర్శకుడు త్రివిక్రమ్  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో తాజాగా విడుదలకు సిద్దంగా ఉన్న అజ్ఞాతవాసి  సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ప్రమోషన్ కార్యక్రమాలు బిజీగా ఉంది చిత్ర యూనిట్. ఈ నెల 19న హైదరాబాద్ లో  జరగబోయే ఆడియో వేడుకాలో రాబోయే తన అబిమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు  జాగ్రతలు తీసుకోవాలని చిత్ర యూనిట్ కు పవన్ కళ్యాణ్ సూచించినట్లు సమాచారం.

ఈ వేడుకకు అతిధిగా  చిరంజీవి వస్తారాన్ని వస్తున్న వార్తలో నిజం లేదని అయన రావడం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసారు. అలాగే పవన్  సభావేదికకు సరిపడా మాత్రమే ఆహ్వానాలు పంపాలని, బయటి వ్యక్తులు ఎవరినీ అదేవిధంగా సినిమాకు సంబంధం లేని ఎవరినీ రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరీ మరీ చెప్పినట్టు సమాచారం.

ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు  .అలాగే ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హీరో వెంకటేష్ వస్తున్నట్లయితే దీన్ని అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించక పోవడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ తన అభిమానుల సమక్షంలో వారికి పెద్దపీట వేస్తూ ఆడియో ఫంక్షన్ జరుపుకునే విధంగా పవన్ జాగ్రత్త తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

తాజా పరిణామాలు బట్టి పవన్ ఇక సినిమాలకు టాటా చేబుతునట్లే అన్నా వార్త  తెలుగు ఇండస్ట్రీ లో  అందరు అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: