మెగా డిజైనర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్న చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత తనతండ్రి చిరంజీవికి అదేవిధంగా తన తమ్ముడు రామ్ చరణ్ కు వారి కాస్ట్యూమ్స్ కు సంబంధించిన విషయాలలో సలహాలు ఇవ్వడమే కాకుండా ఆడిజైన్స్ ను ఫైనల్ చేయడంలో ఆమెదే తుది నిర్ణయం. ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుస్మిత తన తమ్ముడు చరణ్ గురించి అదేవిధంగా తన తండ్రి చిరంజీవి గురించి అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసింది.


 చింరజీవి నటిస్తున్న ‘సైరా’ మూవీలో చిరంజీవి కాస్ట్యూమ్స్ కు సంబంధించి ఎటువంటి రిఫరన్స్ లు లేకపోవడంతో తాను మూడునెలల పాటు తన తండ్రి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ గురించి రీసర్చ్ చేసిన విషయాన్ని బయట పెట్టింది. ఒక క్రియేటివ్ టీమ్ తో ఈసినిమాకు సంబంధించి చిరంజీవి కాస్ట్యూమ్స్ ను రీ క్రియేట్ చేస్తున్నామని అంటూ ఆ విషయాలను ఇప్పుడు బయటపెడితే చరణ్ కు తన పై కోపం వస్తుంది అంటూ జోక్ చేసింది.

 

‘సైరా’ నరసింహారెడ్డిగా తన తండ్రి సిల్వర్ స్క్రీన్ పై కనిపించినప్పుడు మెగా అభిమానులు ఆనందంతో ఈలలు వేయాలి అన్న ఉద్దేశ్యంతో తాను ఈసినిమా కోసం చాల కష్టపడుతున్నాను అంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇదే సందర్భంలో తనతమ్ముడు నటిస్తున్న ‘రంగస్థలం’ సినిమా గురించి మాట్లాడుతూ ఈమూవీలో చరణ్ సుమారుగా 40 లుంగీలను మార్చిన విషయాన్ని బయటపెట్టింది. అంతేకాదు చరణ్ కు ఎప్పుడూ లుంగీ కట్టుకోవడం రాకపోవడంతో తాను చాల కష్టపడి చరణ్ కు లుంగీ ఈజీగా ఎలా కట్టుకోవాలో అలవాటు చేసాను అని అంటోంది


 చిన్నతనం నుండీ కష్టం తెలియకుండా పెరిగిన తనకు తను చిన్నతనం నుండీ అనుభవించిన లగ్జరీ లైఫ్ వెనుక తన తండ్రి చిరంజీవి పడిన కష్టం తనకు ఎప్పుడు గుర్తుకు వస్తుంది అంటూ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసింది. ఇదే సందర్భంలో సుస్మిత మాట్లాడుతూ తనను తన అత్తమ్మ ‘నువ్వెందుకు స్క్రీన్ పైకి వెళ్ళకూడదు ?’ అంటూ సరదాగా ప్రశ్నిస్తుంది అని చెపుతూ ‘అత్తమ్మా చాల లేట్ అయిపోయింది కదా’ అంటూ తాను సమాధానం ఇస్తూ ఉంటాను అన్న విషయాన్ని బయటపెట్టింది. దీనినిబట్టి చూస్తుంటే రానున్న రోజులలో చిరంజీవి నటించే ఎదోఒక సినిమాలో సుస్మిత ఒక ప్రత్యేక పాత్రలో కనిపించినా ఆశ్చర్యంలేదు అనుకోవాలి..      


మరింత సమాచారం తెలుసుకోండి: