భారతీయ సినిమా ఇండస్ట్రీలో విశ్వనటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో అందిరికీ తెలుసు.   లంచం ఇవ్వడ నేరం..లంచం తీసుకోవడం నేరం అన్న కాన్సెప్ట్ తో చివరికి తన కొడుకును సైతం చంపే పాత్రలో భారతీయుడిగా కమల్ హాసన్ తన్ విశ్వరూపం చూపించారు.  చాలా కాలం తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కబోతున్న 'భారతీయుడు' సీక్వెల్‌ను నిర్మించేందుకు సక్సెస్‌ఫుల్ తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Image result for kamal hassan bharatiyudu
తెలుగు, తమిళం, హిందీలో ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు దిల్ రాజు అధికారిక ప్రకటన కూడా చేశారు.  అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి దిల్ రాజు తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ రోజు దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది వంశీ పైడిపల్లి-మహేష్ సినిమా.. నితిన్‌తో 'శ్రీనివాసకళ్యాణం' తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. 
Image result for kamal hassan bharatiyudu
ఆ తర్వాత నితిన్‌, శర్వానంద్‌లతో 'దాగుడుమూతలు' చిత్రాలను చేయబోతున్నానని అలాగే వచ్చే ఏడాది ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేస్తున్నానని అన్నారు. 'భారతీయుడు-2'ను తెరకెక్కించాలని తాను అనుకున్నానని, అయితే సన్నిహితులు వారించారని.. అందుకే ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేశానని వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: