గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ తీస్తున్న సినిమాలు పెద్దగా విజయం సాధించడం లేదు. కానీ ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా సినిమాలు తీస్తూనే ఉన్నారు. అయితే సినిమలే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ఎవ్వరినీ వదలడం లేదు.
తాజాగా పవన్ కల్యాణ్- కీర్తిసురేష్- అను ఇమ్మాన్యుయెల్ కాంబినేషన్లో రానున్న మూవీ ‘అజ్ఞాతవాసి’. రీసెంట్గా విడుదలైన ఈ చిత్రం టీజర్పై తనదైన శైలిలో స్పందించాడు డైరెక్టర్ వర్మ. టీజర్ బాగుందని చెబుతూనే, పవన్ లుక్స్ టాప్ అంటూ రాసుకొచ్చాడు. ఆ మద్య పవన్ , మహేష్ ల పై విపరీతంగా కామెంట్స్ చేస్తూ..సెటైర్లు వేస్తూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే.
కానీ ఈ మద్య మాత్రం పవన్ కళ్యాన్ భజన చేస్తున్నట్లు కనిపిస్తుంది రాంగోపాల వ్యవహారం. టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 64 లక్షల వ్యూస్ దక్కించుకుంది. సౌత్ ఫిల్మ్ఇండస్ర్టీలో ఈ స్థాయిలో వ్యూస్ రాబట్టిన సెకండ్ మూవీ. తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్ టీజర్కి గతంలో 24 గంటల్లో 1.12కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇక అజ్ఞాతవాసి టీజర్కి 24 గంటల్లో 4.12 లక్షల లైక్స్ రాబట్టి కొత్త రికార్డు క్రియేట్ చేసింది.