నితిన్ కథానాయకుడిగా తెరకెక్కించనున్న `హార్ట్ ఎటాక్` సినిమా కొత్త సంస్థ ద్వారానే తీస్తున్నారు. ఈ నెలాఖరున స్పెయిన్లో చిత్రీకరణను ప్రారంభిస్తారని సమాచారం. ఇందులో నితిన్ సరసన ఆదాశర్మ కథానాయికగా నటించబోతోంది.
పూరి జగన్నాథ్ తన కొత్త సంస్థ గురించి చెబుతూ... `నా చిన్నప్పుడు పూరి టూరింగ్ టాకీస్ పేరుతో ఓ థియేటర్ ఉండేది. అందులోనే నేను సినిమాలు చూసేవాడిని.
ఇప్పుడు అదే నా సంస్థకు పేరు కావడం విభిన్నమైన అనుభవాన్నిస్తోంది` అన్నారు. వైష్ణో అకాడెమీ సంస్థ పూరి జగన్నాథ్కి అంతగా అచ్చిరాలేదు. ఆ సంస్థ ద్వారా వచ్చిన సినిమాలు చాలా వరకు పరాజయాన్ని చవిచూశాయి. ఆ సెంటిమెంట్తోనే ఇప్పుడు తన సంస్థకు పేరు మార్చారని అనిపిస్తోంది.