ప్రస్తుతం టాలీవుడ్ లో శృతిహవా నడుస్తోంది. విలక్షణనటుడు కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ఒక  ప్రత్యేక గుర్తింపు తెచ్చు కుంది శృతి. పరిశ్రమ లోకి వచ్చిన  మొదట్లో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ స్వయం కృషి తో  ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.  ప్రస్తుతం  నటన పరంగానే కాదు గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకు వెళ్ళుతోంది. కొద్ది రోజుల క్రితం కామసూత్ర భంగిమతో అలజడి రేపిన శృతిహాసన్ తను ఎలాంటి ఎక్సపోజింగ్ కైనా రెడీ అన్నట్లు సంకేతాలు వదిలింది. గబ్బర్ సింగ్ వరకూ తెలుగులో సరైన హిట్టులేని శృతిహాసన్‌ ఆ సినిమా హిట్ కావడంతో అందరికీ గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది.

శృతి గా నేటి యువతరం గుండెల్లో తిష్ట వేసిన శృతి అసలు పేరు శృతి రాజ్య లక్ష్మి అన్న విషయం చాలా మందికి తెలియదు.  ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి ‘అనగాన గా ధీరుడు’ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ  ఇచ్చిన శృతి గబ్బర్ సింగ్ విజయం తరువాత వెనుతిరిగి చూడలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రముఖ హీరోలు అందరితోను నటిస్తున్న శృతి త్వరలో ప్రిన్స్ మహేష్ తో కూడ నటిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సినిమా ‘డిడే’ ఒక వేశ్యగా నటించి మార్కులు కొట్టేసిన శ్రుతి తాజాగా  మహిళా శక్తిని చాటిచెప్పేలా ఓ ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ ఫోటో షూట్ లో వచ్చే ఆదాయంతో అనాధపిల్లలను చదివిస్తాను అని అంటున్న శ్రుతిహాసన్ సామజిక సేవలో ఇప్పటికే హీరోల వస్తువులు వేలంవేసి సేవ చేస్తున్న సమంతకు ఈ విషయంలో కూడ శ్రుతి గట్టి పోటీనే ఇస్తోంది...
 

మరింత సమాచారం తెలుసుకోండి: